మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Accidentనవతెలంగాణ – హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గుణా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా స్క్రాప్‌ లోడ్‌తో ఉన్న లారీ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. లారీ అదుపు తప్పి కారుపై పడిపోయింది. ఈ క్రమంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలు వారి కుమార్తెలు ఉన్నట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Spread the love