ఏపీలో కత్తులు దూసుకుంటున్నారు: బీవీ రాఘవులు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ రాజకీయాలు అధ్వానంగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పెదనందిపాడులో నూతనంగా నిర్మించిన తేళ్ల నారాయణ విజ్ఞన కేంద్రాన్ని బీవీ రాఘవులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కత్తులు దూసుకుంటున్నారని, విశాఖపట్నం కబ్జాల కేంద్రంగా మారిందని విమర్శించారు. టీడీపీ హయాంలో చేయలేని పనులు మెడకు చుట్టుకున్నాయన్నారు. శాసనసభ భవనాలు శాశ్వతంగా నిర్మిస్తే 3 రాజధానుల పంచాయితీ ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, కేఎస్‌ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love