బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం

నవతెలంగాణ -భీంగల్
బాల్కొండ అభివృద్ధి ప్రదాత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పట్టణ కేంద్రంలో ఒకటో వార్డులో చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ పార్టీ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు తెలియజేశారు. అలాగే ఎనిమిదో వార్డులో కౌన్సిలర్ సతీష్ గౌడ్, కారేపల్లి, దేవనపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు తుక్కాజి నాయక్ ,బొడ్డు గంగారం ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి గెలిపించాలని కోరుతూ డోర్ స్టిక్కర్లను అతికించారు ఈ ప్రచారంలో భీఆర్ఎస్ నాయకులు కవిత గంగాధర్, మంచిర్యాల రమేష్, గోపి, రవి, శ్రీనివాస్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love