బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 3లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి కారు ధ్వంసమైంది. సోమవారం తెల్లవారుజామున రెయిన్‌ బో ఆస్పత్రి ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పగా.. సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ఘటన జరిగిటనట్లు తెలుస్తోంది.

Spread the love