– కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య
– రూ.30 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు
– పనులు ప్రారంభించిన కౌన్సిలర్
నవతెలంగాణ-ఆమనగల్
సీసీ రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలని కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమటం రాధమ్మ వెంకటయ్య అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఉన్న బీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ తోపాటు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.30 లక్షలు వెచ్చించి వార్డు పరిధిలోని బీసీ కాలనీతో పాటు సంకటోనిపల్లి గ్రామంలో అవసరమున్న చోట సుమారు 340 మీటర్ల మేరకు సీసీ రోడ్డును నిర్మిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, యూత్ వింగ్ అధ్యక్షులు డేరంగుల వెంకటేష్, నాయకులు గణేష్, కాలనీ వాసులు ఖుద్దూస్, బాబా, బాలయ్య, కిరణ్, ఎల్లయ్య, శ్రీను, లక్ష్మమ్మ, అలివేలు, జంగమ్మ, వెంకటయ్య, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.