నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళుతున్నారని సమాచారం. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ, పోలవరంకు సంబంధించి సమీక్షలు గానీ జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.