రేపు సీపీఐ(ఎం) పార్టీ సమావేశానికి తరలి రావాలి: చింతల నాగరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం సీపీఐ(ఎం) పార్టీ జనరల్ బాడి సమావేశం రేపు మండల కేంద్రంలో జరిగే ఉదయం 10 గంటలకు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు  ఎల్. దేశ్యానాయక్ హాజరు అవతున్నారు. కావున శాఖ కార్యదర్శిలు,పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల భాధ్యులు సానుభూతి పరులు తరలి రావాలని కోరారు. ఎజెండా సంతాప తీర్మాణం,  పార్లమెంట్ ఎన్నికల పై చర్చించనున్నట్లు చింతల నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love