హకీంపేటలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం, గవర్నర్‌ స్వాగతం

droupadi mormu నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రాష్ట్ర ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, మేడ్చల్‌ కలెక్టర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌, ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌, శంభీపూర్‌ రాజు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.

Spread the love