నవతెలంగాణ – హైదరాబాద్
భారత్ రాష్ట్ర సమితి పార్టీ మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్ దేశరాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూర్నే సరైన వేదికని తొలినాళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పేవారు. అందుకే పార్టీ తొలి కార్యాలయాన్ని నాగపూర్లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. అందులో భాగంగా గురువారం కేసీఆర్ అక్కడకు వెళ్లి.. పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించి.. వారిలో జోష్ నింపనున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు.