కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్‌: ప్రజాపాలనపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొ్న్నారు.

Spread the love