హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్

నవతెలంగాణ – వరంగల్‌: వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హెరిటేజ్‌ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్‌ఆర్‌ నుంచి టెక్స్‌టైల్‌ పార్కును అనుసంధానించాలని అన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని స్పష్టం చేశారు.

Spread the love