- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అబ్బినేని ఓదెలు వ్యవసాయ కూలి (53) వడదెబ్బతో బుధవారం మృతిచెందారు. కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందినట్లుగా గ్రామస్తులు ,కుటుంబ సభ్యులు తెలిపారు. ఓదెలు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ తోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



