యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్ పరీక్షలు ప్రారంభం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల  ( ఎంఏ, /.ఎం. కాం / ఎం. ఎస్. డబ్ల్యూ / ఎం ఎస్సి/ ఎల్.ఎల్.బి / ఎల్. ఎల్. ఎం.) పీ. జీ. మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ.పి.ఈ/ ఐ.పి.సిహెచ్ / ఐఎంబీఏ/)3వ, 5వ,7వ, 9వ  సెమిస్టర్  పరీక్షలు మంగళవారం ప్రారంభమైనట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ తెలిపారు.పరీక్షల నిర్వహణలో  భాగంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం.యాదగిరి  ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనంలోని పరీక్ష కేంద్రాన్నీ తనిఖీ చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సెల్ ఫోన్ లను , ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల వద్దకు అనుమతించవద్దని పరీక్ష నిర్వాహకులకు తెలిపారు.ఈ ఆకస్మిక తనిఖీలో  రిజిస్ట్రార్ తో పాటు   ఆర్ట్స్ అండ్ సైన్స్  కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ అరతి, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ సాయిలు పాల్గొన్నారు.ఈ పరీక్షలకు ఉదయం 1708 మంది విద్యార్థులకు గాను1618 మంది విద్యార్థులు హాజరయ్యారని 90 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 181 మంది విద్యార్థులకు 181 విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ తెలిపారు.
Spread the love