నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోటో జర్నలిస్ట్ కృష్ణ పై దాడి చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అనుమల్ల గంగాధర్, కే.ఎన్.హరి ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం సిద్ధం బహిరంగ సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి చేశారని తెలిపారు.ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టులు తమ వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభల్లో పాల్గొంటుంటారని గుర్తుచేశారు. దానిని రాజకీయ కోణంలో చూడడం సరికాదని వారు హితవు పలికారు.