నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎలాంటి మాస్ కాఫీకీ తావు లేకుండా పగడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ కొనసాగుతుందని పసర పోలీస్ స్టేషన్ సీఐ శంకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మరియు పసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సిఐ శంకర్ ఎస్సై కమలాకర్ తో కలిసి తనిఖీ చేసినారు. అధికారుల ద్వారా ఇప్పటివరకు జరిగిన పరీక్షలు నిర్వహణ తీరు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి కాఫీఇంగ్ తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పరీక్ష కేంద్రం వద్ద పరీక్షలు పూర్తయ్యేంతవరకు 144 సెక్షన్ కొనసాగుతుందని అన్నారు.