నవతెలంగాణ – ఢిల్లీ: కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసి దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కారణంగా మేం ఏమీ చేయలేకపోతున్నాం. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలా చేయడం దారుణం. విపక్ష బ్యాంకు ఖాతా ఫ్రీజ్పై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించట్లేదు. కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేయడం ప్రధానమంత్రి చేస్తున్న నేరపూరిత చర్య’ అని రాహుల్గాంధీ అన్నారు.