ప్రచారం ఉదృతం… పాల్గొన్న కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ శ్రేణులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట

పోలింగ్ గడువు దగ్గర పడటంతో పార్టీలు ప్రచారం ఉదృతం చేసాయి.పోలింగ్ బూత్ ల వారీగా కమిటీలు, బృందాలు ప్రచారం చేస్తున్నారు.బుధవారం కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ నాయకుల సమన్వయ సభ్యులు మండలంలోని పంచాయితీలలో ప్రచారం నిర్వహించారు. బూత్ ల వారీగా ఎన్నికల ప్రచార సామాగ్రి అందజేసారు. కాంగ్రెస్ ను బలపర్చాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు, జూపల్లి ప్రమోద్, తుమ్మ రాంబాబు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, ఎస్.కే పాషా, సీపీఐ(ఎం) నాయకులు చిరంజీవి, గంగరాజు, జగన్నాధం, సీపీఐ నాయకులు రామక్రిష్ణ, శోభన్ బాబు లు పాల్గొన్నారు.
Spread the love