రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే…

 – ఎన్నికల ప్రచారంలో  శ్రీధర్ బాబు
 – అడుగడుగునా.. పూలవర్షం, బ్రహ్మరథం, జననిరాజనాలు 
నవతెలంగాణ-  మల్హర్ రావు: రాష్ట్రంలో త్వరలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోనీ రుద్రారం, శభాష్ నగర్, జంగిడిపల్లి, ఎడ్లపల్లి, కోయ్యూర్, వల్లెంకుంట, ఇప్పలపల్లి గ్రామాల్లో ప్రచారం గడపగడపకు మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య తో కలిసి నిర్వహించారు. శ్రీదర్ బాబుకు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ, ప్రజలు జనసందోహంగా తరలి వస్తూ జననిరాజనాలు, సుస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ-వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు, తులం బంగారం, మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. మహిళలకు నెలకు రూ.2500, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాగానే సన్న బియ్యం, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంటకు 500 బోనస్, గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ. 5 లక్షలు, యువ వికాసం క్రింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు రూ.4000 నెలవారీ పింఛన్, రూ.10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, నిరుద్యోగులకు ప్రతినెల రూ.4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు. రైతులకు మెరుగైన కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉందని, రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వమే అందించిందనీ అన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, సర్పంచ్  జనగామ స్వరూప బాపు, ఎంపిటిసి ఏనుగు నాగరాని, నాయకులు జంగిడి సమ్మయ్య, సెవెందర్, డిజె శ్రీనివాస్, కొండయ్య, భోగే మల్లయ్య, చిగురు సదయ్య పాల్గొన్నారు.
Spread the love