అభివృద్ధి చేశాం.. ఆదరించి ఆశీర్వదించండి..!

– ఎర్రబెల్లిని గెలుపు కోసం కృషి చేయాలి

– ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్ రావు
నవతెలంగాణ- పెద్దవంగర:
రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో దీటుగా అభివృద్ధి చేశామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్ రావు అన్నారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ తో కలిసి గడపగడపకు తిరుగుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తోడ్పాటుతో పాలకుర్తి నియోజకవర్గానికి భారీగా నిధులు తెప్పించి, గ్రామాల్లో ఎంతో వికాసాన్ని తీసుకువచ్చామని తెలిపారు. గతంలో ఏ నాయకుడు చేయని రీతిలో అభివృద్ధి పనులు దయాకర్ రావు చేశారని చెప్పారు. అభివృద్ధికి పాటుపడుతున్న ఎర్రబెల్లిని ప్రజలు మరోసారి నిండు మనస్సుతో దీవించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు నిమ్మల శ్రీనివాస్, మహేష్, సాయి, కొల్లూరు రమేష్, ఉపసర్పంచ్ ఈదురు లచ్చమ్మ, మాజీ సర్పంచ్ గట్ల లక్ష్మినారాయణ, మాజీ ఎంపీటీసీ రహీం, ఉపాధ్యక్షుడు మొగులగాని హరీష్, ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్, దేశెట్టి మహేష్, పోతుగంటి శ్రీశైలం, గట్ల సాయి, కొయ్యేడి యాకయ్య, ఈదురు లచ్చమ్మ, ఈదురు వెంకన్న, ఈదురు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love