భవిష్యత్ భద్రత కాంగ్రెస్ తోనే సాధ్యం 

– కాంగ్రెస్ నియోజకవర్గ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి 

-పెద్దవంగర, పోచంపల్లి లో బీఆర్ఎస్ కు భారీ షాక్ 

నవతెలంగాణ -పెద్దవంగర: పాలకుర్తి ప్రజల భవిష్యత్ భద్రతగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నియోజకవర్గ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవంగర రెడ్డి సంఘం నాయకులు, వార్డు సభ్యులు, పోచంపల్లి ఉపసర్పంచ్ బానోత్ చంద్రశేఖర్, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలారా కదిలి రండి కాంగ్రెస్ పిలుస్తుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరుతో ప్రజల సొమ్మును దోపిడి చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జీ విజయ్ పాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పూర్ణచందర్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, యూత్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, ఎడ్ల సతీష్ రెడ్డి, ఎడ్ల వెంకట్ రెడ్డి, సంకేపల్లి వెంకట్ రెడ్డి, హనుమండ్ల మల్లారెడ్డి, చిలుక సంపత్, రాందయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లచ్చిరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love