ప్రజల కష్టసుఖాల్లో తోడుంటాం: ఝాన్సీ రెడ్డి

నవతెలంగాణ -పెద్దవంగర: పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడుంటామని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. గంట్లకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బందు వెంకన్న తండ్రి మల్లయ్య (70) ఇటీవల వృద్ధాప్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆమె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ ముక్తార్ పాషా, మండల యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, చెరుకు సత్యం, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు తాటిపాముల సంపత్, యూత్ ప్రధాన కార్యదర్శి కొండ్రాతి శ్రీనాథ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్తినేని సోమన్న, మునగాల సోమ నర్సయ్య, కొండ్రాతి కొమరమల్లు, కన్నే శ్రీను, నాగన్న, ఎరుకలి రాజు, కొండ యాకయ్య, ఈరెంటి సమ్మయ్య తదితరులు ఉన్నారు.
Spread the love