కాంగ్రెస్ నేతలు కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం..

నవతెలంగాణ – వేములవాడ 
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం వేములవాడ  పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గల కూరగాయల మార్కెట్లో స్థానిక నాయకులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, కాంగ్రెస్ నేతలు పులి రాంబాబు గౌడ్, చిలుక రమేష్, కూర దేవయ్య, వస్తద్ కృష్ణ, రాజు, ఫిరోజు పాషా, వనపర్తి శంకర్, ముంజ ఉమేందర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు..
Spread the love