ఆది ఇంట్లో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

– కళ్యాణానికి విచ్చేసిన శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు భాజ భజంత్రీల నడుమ వేద పండితులు స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి విచ్చేసి స్వామీ వారి  కళ్యాణ అనంతరం మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి చేతులమీదుగా తీర్థప్రసాదాలు అందజేశారు.శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అది శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని, ఆ భగవంతుడి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దీవించారు. ఆ స్వామి వారి పేరు పైన అనేక  సేవ కార్యక్రమాలు,పాఠశాలలు కట్టించి విద్యా బోధన చేస్తున్నామన్నారు.
సుమారు వెయ్యేళ్ల క్రితమే సమసమాజ స్థాపనకు శ్రీరామానుజాచార్యులు కృషి చేసి గొప్ప సాధువుగా పేరుగాంచారని అన్నారు.శ్రీరామానుజాచార్యులు సమానత్వాన్ని ప్రబోధించిన సంఘ సంస్కర్త, తత్వవేత్త శ్రీరామానుజాచార్యులు అన్నారు. సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో చదువుకున్న పిల్లలు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒలంపిక్స్ లో కూడా పాల్గొని భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి అనేక మెడల్స్ తీసుకువచ్చారని అన్నారు.స్వామివారి కృపతో ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.. వేములవాడ ప్రాంతంలో ఒక గొప్ప నాయకునిగా ఆది శ్రీనివాస్ ఉన్నారని ,ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటునన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావుతో పాటు  పెద్ద ఎత్తున భక్తులు, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love