నవతెలంగాణ-చేర్యాల : జనగామ జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులు గా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చేర్యాల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికునిగా పని చేసి జనగామ కాంగ్రెస్ అభ్యర్థి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు సూచించినట్లు మండల నాయకులు తెలిపారు.కలిసిన వారిలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం సీనియర్ నాయకులు ఉట్ల పల్లి శ్రీనివాస్,ఎండీ. ఖాజా, ఒగ్గు మల్లేశం, బుట్టి యాదగిరి, తుమ్మ శ్రీనివాస్, ఎలుగల దుర్గయ్య, తుమ్మ కుమార్, తుప్పతి రమేష్, కోరె శ్రీశైలం, ఎండీ.నవాజ్ తదితరులు ఉన్నారు.