ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నవతెలంగాణ -తాడ్వాయి  : ఆత్మ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం రమణయ్య గారి తండ్రి దుర్గం రామయ్య అనారోగ్యంతో నిన్న మృతి చెందగా ఆ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆయన (రామయ్య) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డీ, రంగరబోయిన జగన్, మండల నాయకులు కల్తి రమేశ్, దన్నూరి కొంరయ్య, ఇర్ప నర్సింగ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love