కాంగ్రెస్ విజయం.. లండన్ లో సంబరాలు

నవతెలంగాణ డిచ్ పల్లి: ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో లండనలో ఎన్ఆర్ఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చింతల పల్లి కళ్యాణ్ రెడ్డి అధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్, రాష్ట్రంలో గడిల పాలనకి ప్రజలు ముగింపు పలికారని, రాష్ట్రంలో అరు గ్యారంటీలు 100 రోజులలో అమలు చేసి ప్రజాపాలన కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందనే అశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ఇతరులకు కనువిప్పు కలిగేలా ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ సత్త చాటుతుందని కళ్యాణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా గంప వేణగోపాల్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీధర్, నీల, కమలాకర్, రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Spread the love