మహమ్మద్ నగర్ గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం

నవతెలంగాణ – నిజాంసాగర్

ఉమ్మడి మండల కేంద్రంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో వీధి సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు కాంగ్రెస్ యువజన అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గ్రామ అభివృద్ధి కొరకు NREGS నిధుల నుండి పది లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం మహమ్మద్ నగర్ గ్రామానికి మంజూరు చేశారని ఆయన తెలిపారు. అధికారులు అంచనా వేసిన ప్రకారం 250 మీటర్ల పొడవుతో 12 ఫీట్ల అడ్డంతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటరాజు, సత్తయ్య, రామ గౌడ్,మోహన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love