ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌: రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఫలితం తేలే అవకాశం ఉంది.

Spread the love