ముషీరాబాద్ లో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరథ్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.ప్రభాకర్ ప్రజలను కోరారు. సోమవారం ఇందిరా పార్క్ లో ఆయన ముషీరాబాద్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరథ్‌తో కలిసి వాకర్స్ ను  విజ్ఞప్తి చేశారు. బాగ్ లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తమ అమూల్యమైన ఓటు వేసి తానను గెలిపించాలని సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి దశరథ్‌ ప్రజలను కోరారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఈ ప్రచారంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

Spread the love