ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి.. సిపిఐఎంఎల్ ప్రజాపంతా

నవతెలంగాణ – నవీపేట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి సోమవారం మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ మాట్లాడుతూ ఆర్భాటాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా ఎలా జరుపుకుంటారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తూ విద్యార్థులు నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని అన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు పదివేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా ఎడపల్లి, నవీపేట్ మండలాల సంయుక్త కార్యదర్శి గుమ్మల గంగాధర్, సాయిలు, రమేష్, చిన్ను భాయ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Spread the love