ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు సమీపంలో ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Spread the love