ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఏడుగురు మృతి

నవతెలంగాణ – ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నాగాపూర్‌-పూణే హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె నుంచి నాగాపూర్‌-పూణే హైవేపై మెహ‌క‌ర్ రూట్‌లో బ‌స్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ఓ ట్ర‌క్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. గాయ‌ప‌డ్డ‌వారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అయితే, రెండు వాహ‌నాలు వేగంలో ఉండటంతో బ‌లంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తుక్కుతుక్క‌య్యాయి. బ‌స్సు, ట్ర‌క్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. దీంతో, ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది.

Spread the love