నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో ఈరోజు కూడా మన మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అయితే చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు కోల్పోయి 74,482కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22,604 వద్ద స్థిరపడింది.