వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ జట్లను ఒక్కో దేశ క్రికెట్ బోర్డు ప్రకటిస్తుంది. నిన్న (ఏప్రిల్ 29) న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టును ప్రకటించగా.. నేడు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ టీ20 వరల్డ్ కప్ 2024 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కొన్ని సంవత్సరాలుగా గాయంతో ఇబ్బందిపడుతున్న జోఫ్రా ఆర్చర్ ను ఎంపిక చేశారు. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ బౌలర్ క్రిస్ జోర్దాన్ కు స్క్వాడ్ లో చోటు దక్కింది. పేలవ ఫామ్ లో ఉన్న బెయిర్‌స్టోపై సెలక్టర్లు నమ్మకముంచారు. ఐపీఎల్ లో అదరగొడుతున్న విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ చోటు సంపాదించారు. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్.. ఆల్ రౌండర్లుగా మోయిన్ అలీని ఎంపిక చేశారు.
ఇంగ్లండ్ స్క్వాడ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

Spread the love