- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో పత్తి రైతులకు బుధవారం వ్యవసాయాధికారులు ఏ ఈ ఓ విశాల్ గౌడ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘సమగ్ర సస్యరక్షణ’ ఐపిఎం యాజమాన్య పద్ధతులలో భాగంగా రసం పీల్చే పూరుగుల నివారణ కొరకై పసుపు రంగు జిగురు అట్టలను హెల్లో స్టిక్కీ ట్రాప్స్ ఒక ఎకరాకి 8-10 వాడాలని తెలిపారు. దీనివలన రసం పీల్చే పురుగులు పసుపు రంగుకి ఆకర్షితమమై, జిగురు అట్టలకి అత్తుకొని చనిపోతాయనీ చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, ఇమ్రాన్, అశోక్, గుణవంతు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



