తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

ttd-sensational-decisionనవతెలంగాణ-హైదరాబాద్ :  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

Spread the love