తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

TTDనవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఏకంగా 18 కంపార్టుమెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలోనే… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 67,275 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే..నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 25,293 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.07 కోట్లుగా నమోదు అయింది.

Spread the love