నవతెలంగాణ – జుక్కల్
మండలంలో వ్వవసాయాదికారుల లెక్కల ప్రకారం గత ఎడాదీ ఏడు వేల ఎకరాలు పప్పు పంటసాగు చేస్తున్నారు. గతడేది కాకుండా పూర్వీకుల నుండి పప్పు దినుసుల పంటలు అనాదిగా రైతులు పండిస్తు వస్తువ్నారు. రోజురోజుకు పప్పుల రేట్లు విపరితంగా ధరలు పెర్గడంతో సామాన్యులకు ఉప్పులేని కూర ” ఒప్పదు రుచులకు పప్ప లేని తిండి ఫలము లేదు” అన్న సామేతకు పేదల బతుకులు కొనసాగుతు వస్తోంది. ఏ ఫఫ్పులైన ఒక క్వింటాలుకు పదివేల పైనే ధర ఉండటంతో రైతులు కూడా పంట సాగుకు ఎక్కువ మెుగ్గు చూపుతున్నారు. 2024 ప్రస్తుతం ఖరీప్ పంటలో అత్యదికంగా పప్పు దినుసుల పంట సాగుకు రైతులు ఎందుకు ముందుకు వస్తున్నారంటే తొంబై నుండి నూటపది రోజులలో పంట రైతు చేతికి అందడం జర్గుతుంది. డబ్బులు చేతికంది రబిపంట కు పెట్చుబడికి ఉపయేాగపడుతుంది. పక్కనే ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల రైతులు కూడా ఇటువంటి ప పంటల పైన ఎక్కువగా అధార పడి పండిస్తుంటారు. ప్రస్తుతం విత్తనాలు గతేడాది పండించిన రైతుల నుండి అప్పుగా తీసుకుని పంట పండిన తరువాత తిరిగి తీసుకున్న దానికి ఇంకోంత కలిపి తిరిగి ఇవ్వడం జర్గుతుంది .
ఈ సారీ పప్పుల దినుసుల పంటల సాగు గతేడాదీ కంటే పంట సాగు పరిగే ఇవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలో రైతులకు పంట చేతికి అందడం కాక మంచి ధరలు పలుకుతాయానేగి రైతుల అభిప్రాయం.