నవతెలంగాణ సికింద్రాబాద్: మెట్రో స్టేషన్ వద్ద మహిళ డెడ్ బాడీ కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి మెట్రో స్టేషన్ గుర్తుతెలియని మహిళ (35) డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్ ఘటనా స్ధతికి చేరుకొని పరిశీలించగా, ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. దీంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఫొటోలోని మహిళను గుర్తుపట్టిన వారు తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.