కర్నాటక బీజేపీ పోస్టును తొలగించండి

కర్నాటక బీజేపీ పోస్టును తొలగించండి– ఎక్స్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదేశం
న్యూఢిల్లీ : కర్నాటక బీజేపీ అధికారిక ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియోను వెంటనే తొలగించాలని సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ను భారత ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు దేశంలోని ఎక్స్‌ నోడల్‌ అధికారికి ఒక నోటీసును పంపించింది. ఈ వీడియోపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌కు తాము పంపిన నోటీసును ఎన్నికల కమిషన్‌ తన అధికారిక వైబ్‌సైట్‌లో ఉంచింది. కాంగ్రెస్‌ ముస్లింలకు అనుకూలంగా ఉంటుందనే, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు చెందిన నిధులను ముస్లింలకు కాంగ్రెస్‌ మళ్లిస్తుందని అర్థం వచ్చేలా ఈ వీడియాను బిజెపి తయారుచేసింది. ఈ వీడియోలో కాంగ్రెస్‌ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ వ్యంగ్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేవిధంగా ఉందని కాంగ్రెస్‌ ఈ నెల 5న ఫిర్యాదు చేసింది.

Spread the love