సృజనాత్మకత వెలికి డిఈఓ

నవతెలంగాణ-ధర్మసాగర్ 
విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీయాలని డీఈవో డాక్టర్ అబ్దుల్ హై అన్నారు. మండలంలోని నారాయణగిరి గ్రామంలోని ఉన్నత పాఠశాలను సోమవారం మండలంలోని నారాయణగిరి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి శ్రీ డాక్టర్  అబ్దుల్ హై   సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పాఠశాలలోని మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి ఉపాధ్యాయుల బోధన తీరును, విద్యార్థుల ప్రగతిని, వారి వీక్లీ టెస్ట్ జవాబు పత్రాలను పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి జవాబులను రాబట్టారు. పాఠశాలలో జరుగుతున్న మన ఊరు -మనబడికి సంబంధించిన అభివృద్ధి పనులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని అందరి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బి రాంధన్  ను  అడిగి తెలుసుకున్నారు.
Spread the love