- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ కూలీ ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలి మంటలు సిలిండర్లకు వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో సిలిండర్లూ పేలిపోయాయని సమాచారం. ఆ డిటోనేటర్లను ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? పేలుడుకు కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Advertisement -



