ఢిల్లీ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆదివారం కొత్త బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి కృషి చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. నాపై విశ్వాసం చూపిన కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా బాధ్యతలన్నింటినీ నెరవేర్చడానికి నేను కష్టపడి పని చేస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇవి కష్ట సమయాలు, కానీ మేం కలిసి పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో భారత కూటమి విజయం సాధించడాన్ని మీరు చూస్తారు’ అని మీడియాతో అన్నారు.

Spread the love