నవతెలంగాణ – హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరుగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.