నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని మొరంబాయి గ్రామానికి చెందిన కేశవులుకు ప్రభుత్వం నుండి మంజూరైన రూ.60,000అరవై వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును, ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు శుక్రవారం డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో పేద ప్రజలకు వైద్య, ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అలాగే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ చెక్కు అందేలా సహకరించిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి, దుష్యంత్ రెడ్డికి లబ్ధిదారుని కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రజా సేవకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారనడానికి ఇదొక నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కూచూర్ సురేష్,నవాజ్ రెడ్డి, చిర్ప సత్యం,రవీందర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు సంతోష్ నాయక్, సర్పంచులు రవీందర్ రెడ్డి, భాస్కర్ నాయక్ ,సురేందర్, శ్రీశైలం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



