Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాపై కోపంతో నేతన్నలను వేధించొద్దు: కేటీఆర్

నాపై కోపంతో నేతన్నలను వేధించొద్దు: కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి తనతో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా సిరిసిల్లలోని బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను రద్దు చేయడం ద్వారా స్థానిక చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కనీసం గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో లేవని, ఉన్నవాటిని ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 900 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పార్టీ ముఖచిత్రంగా ప్రొజెక్ట్ చేయాలని, ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -