- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను సరిచేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ సర్వే కార్యక్రమాన్నీ శనివారం తాడిచెర్లలో చేపట్టినట్లుగా జిపిఓ గొట్టం నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. బీఎల్ఓలు ఇంటింటికీ సర్వే నిర్వహించి, ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ పూర్తి వివరాలను ఫారాల్లో నింపి, తిరిగి బీఎల్ ఓలకు అందజేయాలన్నారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేయనున్నట్లుగా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు ఎట్టి పరిస్థితిలో తప్పిపోకుండా చూడాలన్నారు. అదేవిధంగా అనర్హుల ఓట్లను తొలగించాలన్నారు.
- Advertisement -



