డీఎంకే తొలి జాబితా రిలీజ్‌..

నవతెలంగాణ – చెన్నై: లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం డీఎంకే త‌న తొలి జాబితాను రిలీజ్ చేసింది. సీనియ‌ర్ పార్టీ నేత క‌నిమొళి.. తూత్తుకుడి నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేయ‌నున్నారు. సీనియ‌ర్లు టీఆర్ బాలు, ద‌యానిధి మార‌న్‌, ఏ రాజాల‌కు కూడా తొలి లిస్టులో చోటు ద‌క్కింది. ఏప్రిల్ 19వ తేదీన త‌మిళ‌నాడులో లోక్‌స‌భ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఈసారి డీఎంకే పార్టీ కొత్తగా 11 మందికి ఛాన్సు ఇచ్చింది. డీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ దురై మురుగ‌న్ కుమారుడు డీఎం క‌తిర్ ఆనంద్‌.. వెల్లోర్ నుంచి పోటీ చేయ‌నున్నారు. మున్సిప‌ల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ కుమారుడు అరుణ్ నెహ్రూ.. పెరంబ‌లూర్ నుంచి పోటీ చేస్తారు. ఎమ్మెల్యే కే పొన్ముడి కుమారు గౌత‌మ్ సింగ‌మ‌ణి.. క‌ల్లాకుర్చి స్థానం నుంచి త‌ప్పించారు. ధ‌ర్మ‌పురి నుంచి డీఎన్వీ సెంథిల్‌కుమార్ స్థానంలో ఏ మ‌ణి పోటీ చేయ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 21 స్థానాల నుంచి డీఎంకే పోటీ చేస్తోంది. చెన్నైలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పాత అభ్య‌ర్థులే పోటీలో ఉన్నారు. చెన్నై సెంట్ర‌ల్ నుంచి ద‌యానిధ మార‌న్‌, చెన్నై సౌత్ నుంచి త‌మిజాచి తంగ‌పాండియ‌న్‌, చెన్నై నార్త్ నుంచి క‌ళానిధి వీరస్వామి పోటీ చేస్తున్నారు.

Spread the love