కాంగ్రెస్ అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దు

– ఓయూ జేఏసి  విద్యార్థి నాయకులు
నవతెలంగాణ- మల్హర్ రావు: కాంగ్రెస్ అబద్దపు మాటలు నమ్మి మోసపోవద్దని ఓయు జెఏసీ విద్యార్థి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.శనివారం మండలంలో కొయ్యుర్ గ్రామంలో  ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓయూ    జేఏసి నాయకులు వేల్పుల కుమార్ మాట్లాడారు మంథని నియోజకవర్గంలో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పాలించి ఏలాంటి అభివృద్ధి చేయలేనిదని విమర్శించారు.ఇప్పుడు జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  బహుజనవాధి, పేదప్రజల ఆశాజ్యోతి మంథని ముద్దు బిడ్డ ఐన బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా మధుకర్ అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిచి కెసిఆర్ బహుమతిగా అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు వల్లెంకుంట బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love