కాంగ్రెస్, బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

 నవ తెలంగాణ- రామారెడ్డి
జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా మండలంలో బుధవారం కాంగ్రెస్, బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరలించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్, నాయకులు సాకలి సాయిలు, చింతకుంట కిషన్, బి పేట నర్సింలు, తదితరులు ఉన్నారు.
Spread the love